ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్నది మేమే : భారతీయ కిసాన్ యూయన్

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (11:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా ముగిసింది. ప్రధాని ప్రయాణించే కాన్వాయ్‌‍ను పంజాబ్ రైతులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఫ్లైఓవర్‌పైనే నిలిచిపోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేరింది. ఈ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సవివర నివేదికను కోరింది. 
 
అయితే, ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు  పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది. ఏడు రైతు సంఘాలు డిసెంబరు 31వ తేదీన సమావేశమై ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారీ నిరసన తెలపాలని ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని చెప్పింది. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని పంజాబ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాదాపు పదివేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా నియమించామని ఆ రాష్ట్ర డీజీపీ పేర్కొన్నారు. పైగా, సభావేదిక ప్రాంగణం మొత్తం ప్రత్యేక దళ పోలీస్ బృందాలో ఉన్నదని గుర్తుచేసింది. అయితే, సభకు తగిన మంది ప్రజలు రాలేదని, పైగా, ప్రధాని చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించారని వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments