Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి ట్రీట్మెంట్‌ కోసం పాముతో వెళ్లిన రైతన్న..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:17 IST)
ఓ రైతన్న ఆస్పత్రికి వెళ్తూ వెళ్తూ నాగుపామును తనతో తీసుకెళ్లాడు. ఆ వృద్ధుడి చాకచక్యాన్ని ప్రస్తుతం నెటిజన్లు కొనియాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్‌కుప్పంకు చెందిన రంగనాథన్ అనే వృద్ధుడు.. తన తోటలో పనిచేస్తుండగా.. ఓ నాగుపాము ఆయన కాలిపై కాటేసింది. 
 
అయితే ఆ పాముకాటును పెద్దగా లెక్కచేయని ఆ వృద్ధుడు.. నొప్పిని తట్టుకుని వెంటనే ఓ గోనె సంచిలో ఆ పామును పట్టుకున్నాడు. ఆపై నాగుపాముతో కూడిన గోనెసంచిని తనతో వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. 
 
అయితే ఆ సంచిలోని రెండున్నర అడుగుల నాగుపామును చూసి రోగులు పరుగులు తీశారు. దీనిపై వైద్యులు వృద్ధుడి వద్ద ఆరా తీస్తే.. తన కాలిపై కాటేసిన పామును సంచిలో వేసుకుని తీసుకొచ్చానని చెప్పాడు. ఫలితంగా ఆ పాము విషాన్ని బట్టి వృద్ధుడికి వైద్యులు చికిత్స అందించారు. ఆపై ఆ పామును అటవీ శాఖా అధికారులు అందజేశారు. 
 
చికిత్స అనంతరం రైతు వృద్ధుడు రంగనాథన్ ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ఏ పాము కరిచిందో తెలియక తికమకపడుతున్న వైద్యులకు కచ్చితమైన చికిత్స ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పామును సంచిలో వేసుకొచ్చినట్లు వృద్ధుడు చెప్పాడు. అతని తెలివికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments