Webdunia - Bharat's app for daily news and videos

Install App

జునాగఢ్‌లో మరో దొంగబాబా... మహిళపై లైంగికదాడి

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:57 IST)
అనేకమంది దొంగ బాబాల చేతిలో మోసపోతున్నారు. అయినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి దొంగ బాబాలను నమ్మి మోసపోయేవాళ్లు సమాజంలో ఏదో ఒక మూల పెరుగుతూనే పోతున్నారు... అలాంటి సంఘటనే జునాగఢ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే.. పెద్ద వాళ్లో... లేకపోతే... లాయర్లో తీర్చడమో అలా కుదరలేదంటే... విడాకులు తీసుకోవడమో చూస్తూనే ఉంటాము... కానీ జునాగఢ్‌లోని ఓ మహిళ తనను తన భర్తతో కలిపేందుకు ఒక స్వామిగారిని కలిసింది.. పర్యవసానంగా ఆవిడ జీవితం బలయింది... 
 
గుజరాత్‌లోని జూనాగఢ్‌కు చెందిన ఒక మహిళ...  భర్త నుంచి విడిపోయి ఉంటున్నారు. అయితే ఆమె తనకు, తన భర్తకు మధ్య నడుస్తున్న వివాదాన్ని తీర్చి, తమను కలిపేందుకుగానూ స్వామీ ఆనంద్ స్వరూపాదాస్ ద్వారా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్వామీజీతో వాట్సాప్ చాటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల స్వామీజీ తనను కారులో తీసుకువెళ్లి శిశుమంగళ్ రోడ్డు సమీపంలో తనపై లైంగిక దాడి చేశారనీ, దానికి డ్రైవర్ కూడా స్వామీజీకి సహకరించాడనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆమె తన ఫిర్యాదులో స్వామీజీ తనకు కత్తి చూపించి, కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన కుమార్తెను తీసుకు వెళ్లిపోతామని హెచ్చరించారని పేర్కొన్నారు. తర్వాత తనను చంపేస్తామని బెదిరించి, రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామీ ఆనంద్ స్వరూప్‌దాస్‌తో పాటు అతని అనుచరుణ్ణి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం