ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కలకలం..!

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:27 IST)
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన నివాసానికి సమీపంలో గురువారం పేలుడు పదార్థాలున్న స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించినట్లు సమాచారం.
 
అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు(డిస్పోజల్ స్కాడ్స్) అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్ చేశారు, తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
కాగా ఈ కారులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారన్నారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments