Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌- అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (12:19 IST)
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు రూ.10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 
 
కేసు మెరిట్‌లపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేజ్రీవాల్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరుతో పాటు సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్‌ చేయడంతో పాటు బెయిల్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 
 
లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments