Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ తుది ఫలితాలను వెల్లడించిన ఎన్టీయే.. సుప్రీం తీర్పు మేరకు సవరణ!!

వరుణ్
గురువారం, 25 జులై 2024 (19:19 IST)
వైద్య విద్యా కోర్సు ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాలను మరోమారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) గురువారం వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేసింది. ఫిజిక్స్‌‍లో అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను తొలగించి, తాజా ఫలితాలను విడుదల చేశారు. 
 
నీట్ ప్రశ్నపత్రంలోని 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు నిపుణుల త్రిసభ్య కమిటీ ఆప్షన్ 4 సరైన సమాధానంగా పేర్కొంది. దాన్ని టిక్ చేసిన వారికే మార్కులు కేటాయించింది. ఈ యేడాది మే నెలలో నిర్వహించిన యూజీ ఎంట్రెన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైన విషయం తెల్సిందే. 
 
ప్రశ్నపత్ర లీక్, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ వంటి అంశాలు వెలుగుచూశాయి. పైగా, జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిన ఈ ఫలితాలను జూన్ 4వ తేదీనే విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ ఫలితాల్లో 67 మందికి 720కు 720 మార్కులు రావడంతో వారంతా టాపర్లుగా నిలిచారు. ఇపుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 67 మంది టాపర్లలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంకును కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments