Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెమోరియల్ హౌస్‌గా మారనున్న జయలలిత నివాసం (video)

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (09:47 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం స్మారక మందిరంగా మారనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దీంతో చెన్నై, తేనాంపేట, పోయస్ గార్డెన్‌లో ఉన్న జయలలిత నివాసమైన వేదా నిలయం మెమోరియల్ హౌస్‌గా మారనుంది. 
 
జయలలిత అనారోగ్య కారణంగా గత 2016 డిసెంబరు ఐదో తేదీన చనిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమెకు చెందిన ఆస్తులపై ఆమె ప్రియ నెచ్చెలి శశికళతోపాటు.. జయలలిత అన్న కుమార్తె దీపా పోటాపోటీగా హక్కులు ప్రకటించారు. జయలలిత ఆస్తులకు తామే వాసులమంటూ ప్రకటనలు ఇచ్చారు. 
 
దీంతో రాష్ట్ర ప్రభుత్వం జయలలిత పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ కోర్టు ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుంది. అదేసమయంలో జయలలిత అధికారిక నివాసమైన పోయస్ గార్డెన్‌ను మాత్రం స్మారక నిలయంగా ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ చర్యల్లో భాగంగా, ఇపుడు వేదా నిలయాన్ని మెమోరియల్ హౌస్‌గా మార్చేందుకు వీలుకల్పించే ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments