Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ సదాశివం!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (14:41 IST)
కేరళ రాష్ట్ర గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆయన పేరును సిఫార్సు చేసింది. ఇక రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. 
 
ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత షీలా దీక్షిత్ ఇటీవలే తన  పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె స్థానంలో సదాశివంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేశారు. 
 
ఇదే జరిగితే న్యాయ వ్యవస్థలో కీలక పదవులు అలంకరించిన ప్రముఖులు కూడా గవర్నర్ గిరీ చేపట్టేందుకు సదాశివం బాటలు వేసినట్టేనన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. యూపీఏ హయాంలో తొమ్మిది నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సదాశివం, 2జీ, కోల్ గేట్ తదితర కేసులపై వేగంగా దర్యాప్తు జరిగేలా చర్యలు చేపట్టారు. అంతేకాక పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సదాశివం సంచలన తీర్పులు వెలువరించిన విషయం తెల్సిందే. 

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

Show comments