Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 సంవత్సరాల పాటు అడవిలో కారులోనే జీవనం: బుట్టలు అమ్ముకుంటూ..?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (16:05 IST)
రుణం చెల్లించకపోవడంతో.. సమాజానికి దూరమైన ఆ వ్యక్తి 14 సంవత్సరాల పాటు కారులోనే జీవనం సాగించాడు. అడవిలో పాత కారునే అద్దాల మేడగా భావించి అక్కడే వుండిపోయాడు. మంగళూరు సులియా తాలూకాలో నూజలు గ్రామస్థుడు చంద్ర శేఖర్ గౌడకు 2.29 ఎకరాల భూమి ఉంది. దానిపై 1999లో నెల్లూర్ కేమరాజే కోఆపరేటివ్ సొసైటీలో రూ.54 వేలు పంట రుణం తీసుకున్నాడు. 
 
రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో సొసైటీ 2002 అక్టోబరులో రూ.1.2 లక్షలకు అతని భూమిని వేలం వేసింది. రుణం మొత్తాన్ని తీసుకొని, మిగిలిన రూ.11 వేలను చంద్రశేఖర్ పేరుపై ఉంచింది. కానీ ఆ సొమ్మును తీసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అతని మానసిక స్థితి బాగా దెబ్బతింది. కొంతకాలం తన సోదరితో కలిసి జీవించాడు. ఆ తర్వాత సెకెండ్ హ్యాండ్ ఫియర్ కారు కొన్నాడు. 
 
2003 జూన్‌లో అతని ఇల్లు ధ్వంసం కావడంతో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. చేసేది లేక సమీపంలోని అడవి వద్ద కారును పార్కు చేసుకుని, దానిలోనే నివసిస్తున్నాడు. జీవనోపాధి కోసం బుట్టలు అల్లి, ఒక్కో బుట్ట రూ.40 చొప్పున అమ్ముతున్నాడు. అతనిని తిరిగి సాధారణ జీవనం గడిపేలా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments