Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్‌కు మద్దతు.. 46 మందిపై ఈపీఎస్ వేటు

ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై తమిళనాడు సీఎం పళనిసామి కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఏకంగా 46మందిపై ఈపీఎస్ వేటు వేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (10:32 IST)
ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై తమిళనాడు సీఎం పళనిసామి కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఏకంగా 46మందిపై ఈపీఎస్ వేటు వేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.
 
వేటుపడిన వారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వున్నారు. వీరంతా ధర్మపురి, మధురై, తిరుచిరాపల్లి, పెరంబులూరు, విల్లుపురం జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే నేతలు వున్నారు. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ సీఎం జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన ఆధారాలను అందజేయాలంటూ చిన్నమ్మకు సమన్లు వెళ్లాయి. 
 
ఈ నెల 22న ఈ-మెయిల్ ద్వారా జైలులో వున్న శశికళకు సమన్లు వచ్చాయని, జయ మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ ఈ సమన్లను జారీ చేసింది. సమన్లు వచ్చిన విషయాన్ని జైలు అధికారులు శశికళకు తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన సమన్లను తీసుకోవడానికి శశికళ నిరాకరించారు. కానీ ఈ-మెయిల్ ద్వారా చిన్నమ్మకు సమన్లు పంపలేదని కమిషన్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments