Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్‌కు మద్దతు.. 46 మందిపై ఈపీఎస్ వేటు

ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై తమిళనాడు సీఎం పళనిసామి కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఏకంగా 46మందిపై ఈపీఎస్ వేటు వేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (10:32 IST)
ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై తమిళనాడు సీఎం పళనిసామి కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఏకంగా 46మందిపై ఈపీఎస్ వేటు వేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.
 
వేటుపడిన వారిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వున్నారు. వీరంతా ధర్మపురి, మధురై, తిరుచిరాపల్లి, పెరంబులూరు, విల్లుపురం జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే నేతలు వున్నారు. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ సీఎం జయలలితకు అందించిన చికిత్సకు సంబంధించిన ఆధారాలను అందజేయాలంటూ చిన్నమ్మకు సమన్లు వెళ్లాయి. 
 
ఈ నెల 22న ఈ-మెయిల్ ద్వారా జైలులో వున్న శశికళకు సమన్లు వచ్చాయని, జయ మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ ఈ సమన్లను జారీ చేసింది. సమన్లు వచ్చిన విషయాన్ని జైలు అధికారులు శశికళకు తెలిపారు. ఈమెయిల్ ద్వారా వచ్చిన సమన్లను తీసుకోవడానికి శశికళ నిరాకరించారు. కానీ ఈ-మెయిల్ ద్వారా చిన్నమ్మకు సమన్లు పంపలేదని కమిషన్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments