రైళ్లలో ఇక వినోదం

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:40 IST)
రైలు ప్రయాణంలో ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఇందుకోసం పైసా ఖర్చు చేయనవసరం లేదని, మొబైల్ డేటా కూడా అవసరంలేదని ప్రకటించింది.

భారతీయ రైల్వే తాజాగా ‘ఎంటర్‌టైన్ మెంట్ ఆన్ డిమాండ్’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. అయితే ఈ సదుపాయం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం పట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో మరో 6 రైళ్లలో ఈ విధమైన సేవలు ప్రారంభం కానున్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఆన్ డిమాండ్ సేవలు ఉలివ్ ప్లేయర్ మాధ్యమంతో ప్రయాణికుల డివైజ్‌లో స్ట్రీమ్ అవుతాయి. అయితే దీనిని ప్రయాణికులు గూగుల్ ప్లేయర్ లేదా యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వైఫై ఆధారంగా మీడియా సర్వర్ నుంచి ఒక కోచ్‌లో ఒకేసారి 90 మంద్రి ప్రయాణికులు కనెక్ట్ చేసుకుని తమకు ఇష్టమైన సినిమాలను చూసుకోవచ్చు. ఈ సదుపాయం కింద ప్రయాణికులు 12 వేల ప్రోగ్రాములతో పాటు ఏడు వేల సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments