Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిక్నిక్ స్పాట్‌గా మారిన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ప్రాంతం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుని పోరిపోగా, వారిని భోపాల్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఓ పిక్నిక్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుని పోరిపోగా, వారిని భోపాల్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఓ పిక్నిక్ స్పాట్‌గా మారిపోయింది. ఎన్‌కౌంటర్ నాటి ఘటనకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఇంకా అక్కడ ఉండగానే.. స్థానికులు ఈ ప్రాంతానికి వచ్చి తెగ సెల్ఫీలు దిగేస్తున్నారు. 
 
ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు ఈ ప్రాంతంలో ఎలాంటి బారికేడ్లు పెట్టలేదు. ఉగ్రవాదులు జైల్లో ధరించిన దుస్తులు అక్కడే పడివున్నాయి. నేలమీద, గడ్డిమీద, రాళ్లమీద.. రక్తం మరకలు ఎండిపోయి వున్నాయి. అలాంటి దృశ్యాలను చూసేందుకు గ్రామస్థులు పిల్లలతో కలిసి వస్తున్నారని, సెల్ఫీలు తీసుకుంటున్నారని స్థానిక పత్రికలు రాశాయి. 
 
కొందరు ఆ ప్రదేశంలో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ పిక్నిక్‌లాగా సమయం గడుపుతున్నారని పేర్కొన్నాయి. ఇదే విషయమై మీడియా పోలీసులను ప్రశ్నించగా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆ ప్రాంతంలో తమకు అవసరమైన సాక్ష్యాలన్నీ తీసుకున్నామని, అందుకే బారికేడ్లు ఏర్పాటుచేయలేదని ఎస్పీ ధరంవీర్‌ సింగ్‌ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments