Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిక్నిక్ స్పాట్‌గా మారిన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ప్రాంతం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుని పోరిపోగా, వారిని భోపాల్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఓ పిక్నిక్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (14:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు తప్పించుకుని పోరిపోగా, వారిని భోపాల్ పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు. ప్రస్తుతం ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం ఓ పిక్నిక్ స్పాట్‌గా మారిపోయింది. ఎన్‌కౌంటర్ నాటి ఘటనకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఇంకా అక్కడ ఉండగానే.. స్థానికులు ఈ ప్రాంతానికి వచ్చి తెగ సెల్ఫీలు దిగేస్తున్నారు. 
 
ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు ఈ ప్రాంతంలో ఎలాంటి బారికేడ్లు పెట్టలేదు. ఉగ్రవాదులు జైల్లో ధరించిన దుస్తులు అక్కడే పడివున్నాయి. నేలమీద, గడ్డిమీద, రాళ్లమీద.. రక్తం మరకలు ఎండిపోయి వున్నాయి. అలాంటి దృశ్యాలను చూసేందుకు గ్రామస్థులు పిల్లలతో కలిసి వస్తున్నారని, సెల్ఫీలు తీసుకుంటున్నారని స్థానిక పత్రికలు రాశాయి. 
 
కొందరు ఆ ప్రదేశంలో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ పిక్నిక్‌లాగా సమయం గడుపుతున్నారని పేర్కొన్నాయి. ఇదే విషయమై మీడియా పోలీసులను ప్రశ్నించగా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆ ప్రాంతంలో తమకు అవసరమైన సాక్ష్యాలన్నీ తీసుకున్నామని, అందుకే బారికేడ్లు ఏర్పాటుచేయలేదని ఎస్పీ ధరంవీర్‌ సింగ్‌ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments