Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ ఫైన్ వేశాడనీ... ఠాణాకు కరెంట్ కట్ చేసిన లైన్‌మేన్

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (20:51 IST)
ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించక పోవడంతో ఓ కరెంట్ లైన్‌మేన్‌కు ట్రాఫిక్ ఎస్.ఐ రూ.500 అపరాధం విధించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ లైన్‌మ్యాన్‌.... కరెంట్ బిల్లు కట్టడం లేదన్న సాకుతో ఠాణాకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రతిచర్య తీసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రాలోని లీనాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక విద్యుత్ బోర్డులో లైన్‌మేన్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఈయన డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీన్ని గమనించిన లీనాపూర్ ఎస్.ఐ. రమేష్ చంద్ర రూ.500 అపరాధం విధిస్తూ చలానా రాశాడు. ఆ తర్వాత హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ గురించి శ్రీనివాస్‌కు ఎస్.ఐ వివరించాడు. 
 
ఈ చర్యతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ విద్యుత్ సబ్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ స్టేషన్‌కు కరెంట్ సరఫరా చేసే లైన్‌ను కత్తిరించాడు. ఈ విషయం తెలియని పోలీసులు.. విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ చేయగా... పోలీస్ స్టేషన్‌కు సంబంధించి రూ.6.6 లక్షల కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉందనీ అందుకే కరెంట్ కట్ చేసినట్టు వివరణ ఇచ్చాడు. పైగా, మొత్తం బిల్లు చెల్లిస్తేనే కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని భీష్మించికూర్చున్నాడు. దీంతో మొత్తం విద్యుత్ బిల్లును చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments