Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (20:44 IST)
దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేవనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్-డిసెంబర్ మధ్య ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుంది.

ఈ వారం చివరి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఇందుకు సంబంధించి సీఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముందుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రక్రియ ముగిసిన తర్వాత జార్ఖండ్‌లో పోలింగ్ చేపట్టనున్నారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు 2014 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 15న పోలింగ్ నిర్వహించి 19న ఫలితాలు ప్రకటించారు. జార్ఖండ్‌ అసెంబ్లీకి కూడా 2014 డిసెంబర్‌లో 5 దశల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉంటుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

హర్యానా, మహారాష్ట్రలకు దీపావళి కంటే ముందే పోలింగ్ పూర్తి చేస్తారని సమాచారం. జార్ఖండ్‌లో మాత్రం నవంబర్-డిసెంబర్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments