Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల సంఘం కొత్త రూల్.. రాజకీయ నేతకు ఇద్దరు భార్యలుంటే..?

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కొత్త నిబంధన పెట్టింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలు తమ ఆదాయ వివరాలతో పాటు భార్య పేరిట గల ఆదాయ వివరాలను కూడా ఈసీకి సమర్పించాలని పేర్కొంది. నామినేషన్లు

Webdunia
శనివారం, 27 మే 2017 (13:56 IST)
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కొత్త నిబంధన పెట్టింది. ఎన్నికల్లో పోటీచేసే నేతలు తమ ఆదాయ వివరాలతో పాటు భార్య పేరిట గల ఆదాయ వివరాలను కూడా ఈసీకి సమర్పించాలని పేర్కొంది. నామినేషన్లు వేసే సమయంలోనే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమతో పాటు భార్య పేరిట గల ఆస్తుల వివరాలను కూడా ఇవ్వాలని ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఒకవేళ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ అభ్యర్థులకు ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే అందరి ఆదాయ వివరాలు ఇచ్చి తీరాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ఇది సహకరిస్తుందని ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఎన్నికల అఫిడవిట్‌లో ప్రత్యేక కాలమ్‌ను కూడా ఈసీ ఏర్పాటు చేసింది. 
 
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, భార్య, అలాగే తనపై ఆధారపడిన వారి ముగ్గురి ఆస్తులు, అప్పులు ఇవ్వాల్సి ఉంది. కాని తాజాగా ఆదాయ మార్గాలను కూడా ఇవ్వాలని కోరడం ద్వారా రాజకీయ నేతలకు కాస్త సంకటమే ఏర్పడిందని చెప్పాలి. అయినా ఆదాయానికి లెక్క చెప్పడం రాజకీయ నేతలకు ప్రత్యేకంగా చెప్పించాల్సిన అవసరం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments