Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్..

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (09:20 IST)
వచ్చే మే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ను మార్చి నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో ముగియనుంది. ఈలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేసి.. ఆరు లేదా ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. భద్రతా దళాలు, ఈవీఎంల అందుబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి మార్చి తొలి వారంలో నోటిఫికేషన్ ఇస్తుంది.
 
లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే నవంబరులో రద్దయిన జమ్మూకాశ్మీ అసెంబ్లీకి కూడా పార్లమెంటు ఎన్నికలతో పాటు లేదంటే దాని కన్నా ముందే ఎలక్షన్ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఎన్నికల సమయంలో భద్రతాపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీనిపై నిర్ణయం తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం