Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల ఫుడ్‌లో ఇక గుడ్డు, మాంసం వుండదా?

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (17:34 IST)
విద్యార్థులకు వడ్డించాల్సిన పోషకాహారంపై మోదీ సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రూపొందించిన పత్రం తప్పుల తడకగా ఉండటమే కాకుండా అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. ఇటీవల వెలుగు చూసిన ఆ పత్రంలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. 
 
గుడ్లు, మాంసం పిల్లల మెనూ నుంచి తొలగించాలని నిపుణుల కమిటీ సూటిగానే సూచించింది. మెనూ మార్చడమే కాకుండా పిల్లలకు అశాస్త్రీయమైన భోజన విధానాలపై పాఠ్యాంశాలు కూడా రూపొందించాలని సిఫార్సు చేశారు.
 
ఎనిమిది మంది నిపుణుల్లో స్కూలు టీచరు గానీ, తల్లిదండ్రుల ప్రతినిధులు గానీ లేకపోవడం గమనార్హం. 'మధ్యాహ్న భోజన ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు అందులో కొలెస్టరాల్‌ లేకుండా చూడాలి. గుడ్ల వంటివి కలపడం మానుకోవాలి. రుచికరమైన పదార్థాలు కలిపిన పాలు, బిస్కట్లు లేకుండా చూడాలి. అధిక కెలోరీలు, కొవ్వు వల్ల ఊబకాయం, హార్మోన్‌ అసమతూకం రాకుండా చూసేందుకు వీటన్నిటినీ నివారించాలి. 
 
గుడ్లు, మాంసం తరచుగా తినడం వల్ల లభించే కొలెస్టరాల్‌ మధుమేహం, ముందస్తు రుతుస్రావం, పిల్లలు కలగకపోవడం వంటి జీవన విధాన జాడ్యాలకు కారణమవుతుంది. మాంసం వల్ల హార్మోనల్‌ అసమతౌల్యం ఏర్పడుతుందని చాలా దేశాల్లో జరిపిన అధ్యయనాల్లో రుజువైంది' అని పత్రంలో ఒకచోట రాసి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments