Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ తరహాలోనే ఏపీలోనూ సంస్థలు: వెంకయ్య నాయుడు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:25 IST)
విద్య, వైద్య, సాంకేతిక, శిక్షణ సంస్థలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదని.. అయితే అలాంటి సంస్థలనే ప్రస్తుతం ఏపీలోనూ నెలకొల్పుతున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఏర్పేడు మండలంలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ లకు శంకుస్థాపన చేశామన్నారు.
 
ఐదేళ్లలో ఐఐటీ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. శ్రీసిటీలో 70 ఎకరాల స్థలంలో ట్రిపుల్ ఐటీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలకు స్థల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని వెల్లడించారు. సమగ్ర భూగర్భ మురుగు కాల్వ పథకం కింద విజయవాడకు రూ.461 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ విభాగం ద్వారా వెయ్యి కోట్లు విడుదల చేయాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందామని చెప్పారు.
 
ఒక ప్రాంతానికి న్యాయం జరగకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న వెంకయ్య.. ఏపీకి తగిన న్యాయం చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. గత ఏడాదికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

Show comments