దేశంలో అత్యధికంగా ఏపీలో రూ.62.29 కోట్లు సీజ్..!

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:27 IST)
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో మద్యం, నగదు ఏరులై పారుతోంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ప్రకటించగా, అదే రోజున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా నగదు, మద్యం ఏరులై పారుతోంది. 
 
ఎన్నికల వేళ యూపీలో అత్యధికంగా రూ.24.50 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోగా... కర్ణాటకలో రూ.20.45 కోట్లు, ఏపీలో రూ.17.13 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు.

దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర ప్రాంతాల్లో ఏకంగా 613.17 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.104.49 కోట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు సమాచారం. 
 
అత్యధికంగా మొదటి విడతలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న ఏపీలో రూ.62.29 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో రూ.49.48 కోట్ల నగదును సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments