Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్‌లో స్వల్ప భూకంపం... రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (08:31 IST)
దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లడఖ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. లడఖ్‌లోని లేహ్‌లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. 
 
అర్థరాత్రి వేళ భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
 
మరోవైపు, పొరుగు దేశమైన మయన్మార్‌లో కూడా భూమి కంపించింది. గురువారం అర్థరాత్రి 11.58 గంటలకు మయన్మార్‌లోని మోన్యవా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అలాగే, జపాన్ కూడా భూమి కంపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments