Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి బలవంతంగా తాగించారు..

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (09:20 IST)
హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగట్‌ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు చెప్పారు. హత్యగా భావిస్తున్న ఈ కేసులో నిందితులైన ఫోగట్‌ సహోద్యోగులు ఇద్దరు ఆమెకు నార్త్‌ గోవాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో పానీయంలో డ్రగ్స్‌ కలిపి బలవంతంగా తాగించారని పోలీసులు చెప్పారు. 
 
నిందితులిద్దరూ పానీయంలో ఓ రసాయన పదార్థాన్ని కలిపి బలవంతంగా తాగించడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని, ఇదే విషయాన్ని నిందితులు సుధిర్‌ సగ్వాన్‌, సుఖ్విందర్‌ సింగ్‌ విచారణలో ఒప్పకున్నారని కూడా ఐజీపీ ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ తెలిపారు.
 
ఫోగట్‌ స్పృహ కోల్పోయిన అనంతరం ఆమెను రెస్టారెంట్‌లోని ఓ వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, అక్కడే రెండు గంటల పాటు ఉన్నారని, అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై నిందితులు నోరు విప్పలేదన్నారు. 
 
పానీయంలో కలిపిన రసాయన పదార్థం వలనే ఫోగట్‌ మరణించినట్టు అనిపిస్తుందని, ఆర్థికపరమైన విషయాలే ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments