Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 1.28 కోట్లతో ఏటిఎం వ్యాన్ డ్రైవర్ పరార్

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (08:25 IST)
ఏటిఎంలు బద్ధలు కొడుతున్న దొంగలతోనే బ్యాంకులు భీతుల్లుతుంటే వారికి వ్యాన్ డ్రైవర్లు, సెక్యూరిటీలు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. కోట్టాది రూపాయల క్యాష్ ఉన్న వ్యాన్లతో పరారవుతున్నారు. తాజాగా మహరాష్ట్రలో ఓ ఏటిఎం వ్యాను డ్రైవరు 1.28 కోట్ల పరారయ్యాడు. దీనిపై బ్యాంకు ఏటిఎం నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
వాణిజ్య రాజధాని ముంబైలో శుక్రవారం వెలుగుచూసింది. నవీ ముంబైలోని 'లాగీ క్యాష్'అనే సంస్థ సదరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని  ఏటీఎంలలో క్యాష్ ను జమ చేస్తుంది. ఆ క్యాష్ ను ఒక వ్యాన్ లో ఏటీఎంలకు తరలించడమే ఆ సంస్థ పని. అయితే లాగీ క్యాష్ లో పనిచేసే అమర్ సింగ్  అనే డ్రైవర్ క్యాష్ పై కన్నేశాడు.
 
ఆ రోజు కోటి రూపాయలకు పైగా ఏటీఎంలలో జమచేయాల్సింది. ఆ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు ఆ వ్యాన్ చేరింది. అక్కడ రూ.16లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంది. క్యాష్ ను ఏటీఎంలో పెట్టడానికి సెక్యూరిటీ గార్డు ఏటీఎం మిషన్ ను డౌన్ చేశాడు. అప్పటికే బయట నిలుచుని ఉన్న ఆ డ్రైవర్ ఇదే అదునుగా భావించి అక్కడ నుంచి ఉడాయించాడు. 
 
రూ. 1.28 కోట్ల నగదు ఉన్న ఆ వ్యాన్ తో డ్రైవర్ తీసుకుని పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments