Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ద్రౌపది వస్త్రాపహరణం.. మౌనంగా భీష్ముడు : సుష్మా స్వరాజ్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:01 IST)
తమ పార్టీ మహిళా నేత, సినీ నటి జయప్రదను లక్ష్యంగా చేసుకుని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోందని, ఎస్పీ పూర్వ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాత్రం భీష్ముడిలా మౌనంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆమె ట్వీట్ చేశారు. 'ములాయం సింగ్‌ యాదవ్ భాయ్‌... మీరు సమాజ్‌ వాదీ పార్టీకి పెద్ద దిక్కు. మీకు సమీపంలోనే ఉన్న రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పొరపాటు చేయవద్దు' అని సుష్మా స్వరాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇదేసమయంలో ఆజంఖాన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్‌ చేశారు. జయప్రద అసలు స్వరూపాన్ని తెలుసుకునేందుకు రాంపూర్ ప్రజలకు 17 సంవత్సరాలు పట్టిందని, తాను మాత్రం 17 రోజుల్లోనే ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని గుర్తించానని ఆజంఖాన్ వ్యాఖ్యానించడంపై మహిళా కమిషన్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments