Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొండపండు లాంటి భార్య, ఆ ఒక్క రాత్రి తను ఇంట్లో లేని సమయంలో మరొకరు వచ్చారనీ...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (21:55 IST)
వారిద్దరి అన్యోన్యమైన దాంపత్యం. బంధువులే భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనేవారు. అయితే అనుమానం వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అందమైన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో తరచూ గొడవపెట్టుకునేవాడు భర్త. చివరకు చేసేది లేక ఆత్మహత్య చేసుకుంది భార్య. 
 
తమిళనాడు కాంచీపురం సమీపంలోని కుప్పమ్మల్ వినాయకపురంలో కదిరివేల్, మణిమంగలై దంపతులు నివాసముండేవారు. వీరికి 8 సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. 
 
కదిరివేల్ ప్రభుత్వ బ్యాంకులో సెక్యూరిటీ ఉద్యోగి. రాత్రి వేళల్లో ఉద్యోగం నిమిత్తం వెళ్లేవాడు. అయితే సరిగ్గా రెండునెలల నుంచి వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కుప్పమ్మల్ బంధువు రాత్రి వేళలో వచ్చి ఇంట్లో నిద్రించాడు. వరుసకు మామ. 
 
పనిమీద కాంచీపురం రావడంతో తెలిసిన బంధువు ఇంటిలోనే సేదతీరాడు. ఇక అప్పటి నుంచి కదిరివేల్‌లో అనుమానం మొదలైంది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతో ఊగిపోతూ పదేపదే గొడవకు దిగేవాడు. 
 
భర్తకు ఎంత సర్దిచెప్పినా వినిపించుకునేవాడు కదా. దాంతో పాటు తాగుడికి బానిసై ప్రతిరోజు భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో నిన్న రాత్రి కుప్పమ్మాల్ ఉరి వేసుకుని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తనలా మరొకరికి ఇలాంటి కష్టం రాకూడదని.. చేయని తప్పుకు నరకం అనుభవిస్తున్నాననీ, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సుసైడ్ లేఖ రాసి చనిపోయింది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments