Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:38 IST)
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో కనిపించకుండా పోయిన 70ఏళ్ల మహిళను కుక్కలు పీక్కుతిన్నాయి. ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోవడం గత పది నెలల్లో ఇది ఐదోసారి. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బిస్మిల్లా బాయి అనే 70 ఏళ్ల మహిళ మార్చి 22వ తేదీన కనిపించకుండా పోయింది. 
 
ఇలా మధ్య ప్రదేశ్ ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన 70 ఏళ్ల మహిళను కుక్కలు పీక్కు తినేశాయి. ఆమె శరీరంలోని అవశేషాలను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. సజీవంగా ఉన్నప్పుడే బిస్మిల్లా బాయిపై కుక్కలు దాడి చేశాయని.. శరీర అవయవాలను పీక్కుతిన్నాయని చెప్పారు. 
 
ఆమె తల, ఛాతి భాగాల ఆధారంగా బిస్మిల్లా బాయిపై శునకాల దాడి జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఆస్పత్రి వెనుక గేటు ద్వారా ఆమెను వెళ్లిపోవాలని భావించిందని.. వైద్య సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిన.. ఆమె శునకాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments