Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు .. అందుకే డోలో-650 మాత్రలు..

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (22:17 IST)
ఒక ఫార్మా కంపెనీ తయారు చేసే 650 మాత్రలను వైద్యులు అత్యధిక మంది రోగులకు సిఫార్సు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఓ పిటిషన్ దాఖలు కాగా, దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
తేలికపాటి జ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను వైద్యులు రాస్తున్నారంటే అందుకు కారణం ఆ మాత్రల తయారీదారులు వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం వల్లనేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను పది రోజుల్లో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 
 
"పైగా, ఇదేమీ వీనులవిందైన సంగీతం కాదు. నాకు కరోనా వచ్చినపుడు కూడా ఇదే మాత్ర వాడాలని రాశారు. ఇది సీరియస్ మ్యాటర్" అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఈ సంస్థ తరపున న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. 
 
డోలోను ప్రమోట్ చేసేందుకు సదరు కంపెనీ డాక్టర్లకు తాయిలాల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇలాంటి మందుల అతి వినియోగంతో రోగుల  ఆరోగ్యం డోలాయమానంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments