Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసు ఇవ్వను.. : కమల్‌హాసన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:32 IST)
‘మీ అందరికీ ఉచితంగా చేపల పులుసు వండిపెట్టను. అయితే యేడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇస్తాను. చేపలు పట్టే సామర్థ్యాన్ని అందిస్తాను’ అంటూ మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు.

కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆయన ఆ నియోజకవర్గం పరిధిలోని శివానంద కాలనీలో ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. ఉచిత తాయిలాల వల్ల రాష్ట్రంలో పేదరికం పోదని, ఉచితాలు తీసుకోవడమే పనిగాపెట్టుకునే ప్రభుత్వ రుణభారం పెరిగిపోతుందని అన్నారు.

ఈ రుణభారాన్ని నిరోధించడానికి అనువైన పరికరంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ‘మీ అందరికి ఉచితంగా ఒక రోజు చేపలపులుసు అందించి సంతృప్తిపరచాలని భావించడం లేదు. ఏడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇచ్చి మీరు సొంతంగా సంపాదించుకునేలా ఉండాలన్నదే మా పార్టీ ఆశయం’ అన్నారు. 

చేపలు పట్టే టెక్నిక్‌ తెలుసుకుంటే పదిమంది ఉచితంగా చేపల పులుసు ఇచ్చే స్థితికి చేరుకోగలరని కమల్‌ అన్నారు. తనను స్థానికేతరుడని మైలాపూరు అమ్మవారు (వానతి శ్రీనివాసన్‌) చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments