Webdunia - Bharat's app for daily news and videos

Install App

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

సెల్వి
సోమవారం, 5 మే 2025 (14:53 IST)
A Raja
తమిళనాడులోని మైలాడుదురైలో జరిగిన బహిరంగ సభలో డీఎంకే ఎంపీ ఎ రాజా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం వీచిన బలమైన గాలుల కారణంగా వేదిక దగ్గర ఓవర్ హెడ్ లైట్లు పడిపోయాయి. వేదిపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. స్టేజీ లైట్ ఆయనపై పడబోయింది.
 
ముందుగానే విషయం గుర్తించిన ఆయన క్షణాల్లోనే పక్కకు జరగ్గా.. మైకుపై లైటు కుప్పకూలింది. ఒకవేళ ఆ లైటు ఎంపీపై పడుంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు సహా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.  
 
ముఖ్యంగా ఆ భారీ స్టేజ్ లైట్ ఒక్కసారిగా ఎంపీ రాజాపైకి దూసుకురాగా.. ముందుగానే విషయం గుర్తించిన ఆయన ఒక్కసారిగా పక్కకు జరిగారు. అలా ఆయన జరిగిన కొన్ని సెకన్లలోనే లైట్ మైక్‌పై పడింది. దీంతో మైక్ విరగడంతో పాటు.. అక్కడి స్టేజీ కూడా అటూ ఇటూ కదిలింది. ఇలా తృటిలోనే ఎంపీ రాజా ఈ ప్రమాదం నుంచి బయట పడగా.. పార్టీ శ్రేణులు, ప్రజలంతా ఊపిరి పీల్చున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments