Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీపై మండిపడిన కరుణానిధి : అంతా మీయిష్టమేనా?

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:03 IST)
"ఉపాధ్యాయ దినోత్సవం"పై నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం పేరును "గురు ఉత్సవ్‌"గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల నుంచి ఉపాధ్యాయ దినోత్సవం పేరిటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడేమో కేంద్రం గురు ఉత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహించమని ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మా భాషను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. భాషతోనే అత్యున్నత శిఖరాలు చేరుకున్న వారి ప్రతిష్ఠను ఇలాంటి చర్యలు కించపరిచేవే.’’ అంటూ ఆదివారం చెన్నైలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
సంస్కృతం వారోత్సవాల నిర్వహణకు సంబంధించి సీబీఎస్ఈ జారీ చేసిన ఉత్తర్వులపైనా కరుణానిధి మండిపడ్డారు. కేంద్రంతో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు హిందీని వినియోగించాలన్న విషయంలోనూ ఇటీవలి మోడీ సర్కారు వైఖరిపై తమిళనాడు పార్టీలన్నీ ఒంటికాలిపై లేచిన సంగతి తెలిసిందే. బీజేపీ మిత్ర పక్షం ఎండీఎంకే, పీఎంకేలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా నాడు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ‘‘ఆ ఆదేశాలు కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలకే’’ నంటూ కేంద్రం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments