తమ్ముడూ రజినీ... ప్రజా సేవలో కాలి చెప్పులాంటోడిని....

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెండితెరపై వేసే పంచ్‌లకు సినీ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. అలాంటి రజినీకాంత్ నిజ జీవితంలోనూ పంచ్‌లు వేశారు. అదీ కూడా తమిళ సూరీడు కరుణానిధిపై. దీనికి కరుణానిధి వేసిన పంచ్‌

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (11:57 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెండితెరపై వేసే పంచ్‌లకు సినీ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. అలాంటి రజినీకాంత్ నిజ జీవితంలోనూ పంచ్‌లు వేశారు. అదీ కూడా తమిళ సూరీడు కరుణానిధిపై. దీనికి కరుణానిధి వేసిన పంచ్‌తో రజినీతో పాటు.. అతిథులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. గతంలో జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే...
 
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధితో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ ఒకే వేదికపై కలసుకున్నప్పుడు సీరియస్ పంచ్‌లు పడుతుండేవి. అలాంటి ఓ సంఘటన ఇది...
 
కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో కరుణానిధితో పాటు.. ఈ కార్యక్రమంలో రజినీకాంత్, కరుణానిధి పాల్గొన్నారు. ముందుగా మాట్లాడిన రజినీకాంత్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ ఒక మాటన్నారు. 'రాజకీయ నాయకులంటే నిప్పు లాంటివారు.. వారు మనకు ఎంత సన్నిహితులైనా సరే, ఆ నిప్పుల సెగ తగలకుండా మనం జాగ్రత్తగా ఉండాలి..' అన్నారు.
 
ఆ తర్వాత మాట్లాడిన కరుణానిధి... రజినీకాంత్‌కు కౌంటర్‌గా పంచ్ వేశారు. 'తంబీ.. నాన్ ఊళలుక్కు మట్టుం నెరుప్పు... ఆనాల్ సేవయిల్ మక్కళ్ కాల్ సెరుప్పు', అంటే 'తమ్ముడూ నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటోడిని.. కానీ సేవలో ప్రజల కాలి చెప్పులాంటోడిని' అని పంచ్ వేశారు. మాటల మాంత్రికుడు, సాహితీవేత్త అయిన ఈ రాజకీయ దిగ్గజం ఇచ్చిన ఆ పంచ్‌తో ఆ సభ చప్పట్లతో మారుమోగిపోయింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments