Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నంగా సుశాంత్ మేనేజర్ దిశ మృతదేహం... ముంబై పోలీసులు ఏమంటున్నారు? (video)

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:27 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారింది. దీనికంటే ముందు... ఆయన మేనేజర్ దిశ సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. అయితే, దిశ ఆత్మహత్య కేసులో ఇపుడు సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 
 
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్‌పై అత్యాచారానికి పాల్పడి చంపారని, ఆమె మృతదేహాన్ని నగ్నంగా గుర్తించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. చనిపోయే సమయంలో ఆమె శరీరంపై దుస్తులున్నాయని వెల్లడించారు. ఆత్మహత్య జరిగిన వెంటనే దిశను ఆమె స్నేహితులు ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. 
 
దిశ శరీరంపై గాయాల గుర్తులేమేనా ఉన్నాయోమేనని పరీక్షించామని, ఆ తర్వాతే పంచనామాకు పంపించామని తెలిపారు. దిశ మరణించిన ముందు రోజు రాత్రి జరిగిన పార్టీకి ఆమె స్నేహితులు, ప్రియుడు మాత్రమే హాజరయ్యారని, రాజకీయ నాయకులెవరూ అక్కడ లేరని తెలిపారు. 
 
సుశాంత్ మరణానికి ఐదు రోజుల ముందు, జూన్ 9 రాత్రి ఓ బిల్డింగ్‌పై నుంచి దూకి దిశ ఆత్మహత్య చేసుకుంది. మరో ఐదు రోజుల్లో సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments