Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాందేవ్ ఓ దొంగ బాబా.. కాషాయం ధరించి వ్యాపారాలు చేసుకోవచ్చా?: డిగ్గీ రాజా

యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన డిగ్గీ రాజా రాందేవ్‌ ఓ దొంగ బాబా అంటూ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:29 IST)
యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన డిగ్గీ రాజా రాందేవ్‌ ఓ దొంగ బాబా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ అనుచరులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగ్విజయ్ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు. అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ఆదివారం 14 మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. 
 
కానీ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని డిగ్గీ రాజా అన్నారు. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. 
 
మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మికవేత్తగా ఉన్నవ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ డిగ్గీ రాజా ప్రశ్నించారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments