Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (09:48 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ అధికార అన్నాడీఎంకే మంత్రి, ఆ పార్టీ కోశాధికారి దిండుగల్ శ్రీనివాసన్ ఆరోపించారు. ఆయన శనివారం ఇదే అంశంపై మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు స్లో పాయిజన్‌ ఇవ్వడం వల్లే ఆమె చనిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. 
 
జయలలితను ఇంట్లో బందీగా ఉంచి మధుమేహం అధికమయ్యేలా స్లో పాయిజన్‌ ఇవ్వడంతో పాటు వేళాపాళా లేకుండా ఆహారం అందించారన్నారు. దీనికి కారణం శశికళ - టీటీవీ దినకర్ వర్గమేనని ఆరోపించారు. దినకరన్‌ తీరును గమనించిన జయ ఆయన్ని పదేళ్ల పాటు పార్టీ నుంచి తొలగించారని గుర్తు చేశారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో చేతులు కలిపి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ పన్నిన కుట్రలు ఫలించబోవని మంత్రి శ్రీనివాసన్ జోస్యం చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments