Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల: అంతర్జాతీయ ప్రమాణాలతో ఎరుమేలి డివోషన్ హబ్

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (10:56 IST)
ఈ ఏడాది శబరిమల తీర్థయాత్ర సీజన్ ముగిసిన తర్వాత ఎరుమేలిలో కన్వెన్షన్ సెంటర్‌తో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో భక్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ తెలిపారు. శబరిమల సీజన్ కోసం ఎరుమేలిలోని చెరియంబళంలో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని మంత్రి బుధవారం ప్రారంభిస్తూ ఈ ప్రకటన చేశారు. 
 
పార్కింగ్ ఏరియాకు ఇరువైపులా రోడ్డును అభివృద్ధి చేసేందుకు వరద సహాయ నిధి నుంచి అదనంగా రూ.20 లక్షలు కేటాయిస్తానని మంత్రి తెలిపారు. హౌసింగ్ బోర్డు ఎరుమేలిలోని తన స్థలంలో అంతర్జాతీయ స్థాయి భక్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం  పేర్కొంది. 
 
ప్రాజెక్ట్ మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో పార్కింగ్ సౌకర్యాలను అందించడంపై దృష్టి పెట్టింది. రెండవ దశలో తినుబండారాలు, రిఫ్రెష్‌మెంట్ సెంటర్, ఫలహారశాల, విశ్రాంతి గదులు జోడించబడతాయి.
 
మూడవ దశలో అతిథి గృహాలు, కాటేజీలు, డార్మిటరీలు సహాయక సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతం చెరియంబలం సమీపంలోని కేరళ స్టేట్ హౌసింగ్ బోర్డుకు చెందిన ఆరున్నర ఎకరాల స్థలంలో సగభాగంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. శబరిమల మండల పూజ.. మకర జ్యోతి ఉత్సవాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments