Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్స్‌ లేకపోవడంతో బైక్‌పై మృతదేహాన్ని తరలించిన వ్యక్తి.. ఎక్కడ?

ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటిక

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (09:08 IST)
ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించడంతో.. భార్య మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తరలించాడు. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో ఈ అమానుషం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లా రణిబరి గ్రామానికి చెందిన శంకర్ షా (60), సుశీల దేవి (50) భార్యాభర్తలు. 
 
ఇటీవల అనారోగ్యం కారణంగా పుర్ణియా సదర్ ఆసుపత్రిలో చేరిన సుశీల.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించింది. అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది మార్చురీ వ్యాన్ ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడంతో కుమారుడు బైక్ తీసుకురాగా.. మధ్యలో తల్లి మృతదేహాన్ని పెట్టి వెనక తండ్రి కూర్చోగా ఇంటికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ పాల్ విచారణకు ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments