Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచిన ఉద్యోగి... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (15:12 IST)
తనకు ఆఫీసులో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను ఓ ఉద్యోగి కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమిత్ కుమార్ సర్కార్ అనే వ్యక్తి కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలోని కరిగరి భవన్‌లో సాంకేతిక విద్యా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గురువారం సెలవు కావాలని దరఖాస్తు చేయగా, పై అధికారులు తిరస్కరించారు. ఈ విషయంపై ఆనయ తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. 
 
ఈ క్రమంలో అతడు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో నలుగురు ఉద్యోగులపై దాడి చేశాడు. ఆ తర్వాత కత్తి, రక్తపు మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ కార్యాలయానికి చేరుకుని గాయపడిన సహోద్యోగులు జయదేవ్ చక్రవర్తి, సంతను సాహా, సర్తా లతే, షేక్ సతాబుల్ అనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 
 
దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు స్పందిస్తూ, 'నార్త్ 24 పరగణాల జిల్లా సోదేపూర్‌లో ఘోలా వాసి సర్కార్ సాంకేతిక విద్యావిభాగంలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం సెలవు విషయమై తన సహోద్యోగులతో జరిగిన గొడవ నేపథ్యంలో అతను వారిపై కత్తితో దాడి చేసి, పారిపోవడానికి ప్రయత్నించాడు' అని పోలీసులు తెలిపారు. దీంతో సర్కార్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. సర్కారుకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments