Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ లేదని చెప్పారు.. అంతే దాబాకే నిప్పంటించారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (11:22 IST)
చికెన్ లేకుంటే కొందరికి ముద్ద దిగదు. అలాంటి వ్యక్తి చికెన్ లేదని చెప్పిన దాబాకు నిప్పు అంటించాడు. అసలే తాగినమత్తులో ఉన్నవారు ఏకంగా దాబాకు నిప్పంటించేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్ టైడే(29), సాగర్ పటేల్(19) ఇద్దరు ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం అర్దరాత్రి ఒంటిగంట సమయంలో బెల్టారోడి ప్రాంతంలోని రోడ్డుపక్కన ఉన్న ఓ దాబా హోటల్‌కు వెళ్లారు. 
 
చికెన్ ఐటమ్ కోసం ఆర్డర్ చేశారు. అయితే అప్పటికే ఆ దాబాలో చికెన్ అయిపోంది. దీంతో దాబా ఓనర్ వారికి చికెన్ దొరకదని సమాధానం ఇచ్చాడు.. అయితే శంకర్, సాగర్‌లు మాత్రం తమకు తప్పకుండా చికెన్ కావాలని దాబా ఓనర్‌తో వాదనకు దిగారు. తినడానికి చికెన్ ఐటమ్స్ దొరకకపోవడంతో ఆవేశానికి లోనైన ఇద్దరు నిందితులు దాబాకు నిప్పంటించారు.
 
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. దాబాలోని వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. దాబా కాలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక, కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments