Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢ నిద్రలో ప్రయాణికులు - యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారం...

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (17:44 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం జరిగే సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు క్లీనరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సులో 30 యేళ్ళ ఓ యువతి ఎక్కింది. ఆమెతో పాటు.. మరో 45 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అయితే, బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా, ఈ యువతిపై బస్సు క్లీనర్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించింది. 
 
స్లీపర్ బస్సులో ప్రయాణికులంతా నిద్రిస్తుండగా.. బస్సు క్లీనర్ ఆమెను బలాత్కరించినట్టు ఆమె పేర్కొంది. ఈ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా, ఈ ఘాతుకం జరిగినట్టు సమాచారం. సమయంలో బస్సులో 45మందిపైగా ప్రయాణికులున్నారని ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments