హస్తిన వాసులకు శుభవార్త.. కేసులు తగ్గాయ్.. ఆ ఆక్సిజన్‌ అక్కర్లేదు...

Webdunia
గురువారం, 13 మే 2021 (14:43 IST)
హస్తినవాసులకు ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓ శుభవార్త చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం చాలా మేరకు తగ్గిందన్నారు. ఈ కారణంగానే గత 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 10400కు తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 14 శాతానికి చేరిందన్నారు. అందువల్ల తమకు ఇస్తున్న ఆక్సిజన్‌లో మిగులు ఆక్సిజన్‌ను వేరే రాష్ట్రాలకు కేటాయించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. 
 
''కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కేంద్రం, ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. కేసులు బాగా పెరిగినప్పుడు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆక్సిజన్ అవసరం కూడా 582 మెట్రిక్ టన్నులకు తగ్గింది. మిగులు ఆక్సిజన్‌‍ను వేరే రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రానికి చెప్పాం. మాది బాధ్యత గల ప్రభుత్వం'' అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
 
అలాగే, ప్రస్తుతం ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని, చాలా వరకు ఆక్సిజన్ అవసరం తగ్గిందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. 15 రోజుల క్రితం వరకు రోజూ 700 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం అయిందని, ఇప్పుడది 582 టన్నులకు తగ్గిందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments