Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (11:28 IST)
రైల్వే స్టేషన్‌లలో ఉండే కొందరు పోర్టర్లు ఏమాత్రం మానవత్వం లేని వారిగా ప్రవర్తిస్తుంటారు. రైలు ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టిపీడిస్తుంటారు. తాజాగా ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఓ పోర్టర్ చేసిన పాడుపనికి రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతని పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేసి, పోర్టర్ బ్యాడ్జ్‌ను కూడా వెనక్కి తీసుకుంది. ఇంతకీ ఈ పోర్టర్ చేసిన పాడుపడి ఏంటంటే.. వీల్ చైర్ సర్వీస్ కోసం ఓ ఎన్నారై నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ ఎన్నారై కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు పోర్టర్ తీసుకున్న రూ.10 వేల డబ్బులో రూ.9 వేలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటనలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. పోర్టర్ నుంచి బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ వెనక్కి తీసుకున్నట్టు తెలిపింది. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్‌లలో వీల్ చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయి. అయితే, గత నెల 28వ తేదీన తన తండ్రి నుంచి ఏకంగా రూ.10 వేలు వసూలు చేశారంటూ ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ పోర్టర్‌ను గుర్తించి అతడి నుంచి రూ.9 వేలు వెనక్కి తీసుకుని ప్రయాణికుడికి అందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్ స్పందిస్తూ, ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి రైల్వే కట్టుబడివుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు రైల్వే శాఖ ప్రతిష్టను దిగజారుస్తాయని, ఇలాంటి సమస్యలు ఎదురైతే 139కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments