Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భారీ ఉగ్రవాద దాడికి ఉగ్రవాదుల ప్లాన్, పోలీసులకు హెచ్చరికలు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:02 IST)
ఢిల్లీ పోలీసులకు జూలై 20న నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. డ్రోన్ల సహాయంతో దేశ రాజధానిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం వున్నట్లు సమాచారం ఇచ్చారు. 

ఆగస్టు 15 లోపు ఉగ్రవాదులు ఈ దాడిని అమలు చేయవచ్చని వార్తా సంస్థ ఎఎన్ఐ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థితిని కోల్పోయి, ఆర్టికల్ 370ను ఆగస్టు 5, 2019 న రద్దు చేసినందున, ఉగ్రవాద దాడి దాని వార్షికోత్సవం సందర్భంగా అమలు చేయాలని ఉగ్రవాదులున్నట్లు తెలిపారు.
 
ఢిల్లీలో ‘ఆపరేషన్ జిహాద్’ ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని ఎబిపి వార్తలు తెలిపాయి. అంతేకాకుండా, ఉత్తర ప్రదేశ్‌లో అరెస్టయిన ఇద్దరు అల్-ఖైదా ఉగ్రవాదులు ఆగస్టు 15కి ముందు ఢిల్లీలో ఉగ్రవాదులు పెద్ద ఉగ్రవాద దాడికి యోచిస్తున్నట్లు అంగీకరించారు.
 
ఇదిలావుంటే సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ శిక్షణతో సహా యుఎవి (మానవరహిత వైమానిక వాహనం) దాడులను ఎదుర్కోవటానికి ఢిల్లీ పోలీసులకు మరియు ఇతర భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. అదనంగా, భారత వైమానిక దళం ప్రత్యేక డ్రోన్ నియంత్రణ రూంని ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన యాంటీ-డ్రోన్ వ్యవస్థల సంఖ్యను కూడా నాలుగుకు పెంపుదల చేసారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments