Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను 35 సార్లు కత్తితో పొడిచాడు.. అడ్డొచ్చిన కొడుకుని కూడా.. ఎందుకంటే..?

అనుమానం పెనుభూతమైంది. తన భార్య పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇక అంతే.. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగుల

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (08:43 IST)
అనుమానం పెనుభూతమైంది. తన భార్య పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇక అంతే.. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌కు చెందిన బినోద్ బిష్ట్‌ అనే వ్యక్తికి భార్య రేఖతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. ఓ కేటరింగ్ సంస్థలో మేనేజరుగా పనిచేసే బినోద్ భార్య ఓ యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. భార్యతో బినోద్ గొడవపడుతున్నపుడు అతని సోదరుడు కూడా అదే ఆవరణలోని మరో ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఆ ఫ్లాట్‌కు బినోద్ బయట నుంచి గడియపెట్టాడు. 
 
ఆపై భార్యను తిడుతూ కత్తి తీసుకొని 35 పోట్లు పొడిచాడు. అంతలో పక్కగదిలో నిద్రపోతున్న బినయ్ కుమారుడు వినీత్ అడ్డుకోబోగా అతన్ని కూడా కత్తితో పొడిచాడు. తీవ్రగాయాల పాలైన తల్లీ, కుమారులను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి మరణించింది. కుమారుడు వినీత్ కోలుకుంటున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments