Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (14:40 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. దీంతో దేశ రాజధానిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ సీఎం అతిశీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా కాంగ్రెస్ తరపున అల్కా లాంబా, బీజేపీ నేత రమేశ్ బిధూరి ఎన్నికల బరిలోకి దిగారు. 
 
కాగా, తన ఆస్తుల విలువ రూ.76,93,347గా అతిశీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని తెలిపారు. తనకు కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందన్నారు. తనకు సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు. రెండు పరువునష్టం కేసులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. అయితే, గత 2020లో దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అతిశీ ఆస్తులు రూ.17 లక్షలుగా ఉంటే ఇపుడు ఈ ఆస్తులు రూ.76 లక్షలకు పెరగడం గమనార్హం. 
 
అల్కా లాంబా తనకు రూ.3.41 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments