Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేజ్రీవాల్‌కు గుజరాత్ కోర్టు షాక్... రూ.25 వేల అపరాధం

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (18:28 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ కోర్టు షాకిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు చూపించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయనకు చుక్కెదురైంది. ప్రధాని మోడీ సర్టిఫికేట్ల అంశం ప్రజలకు సంబంధించిన విషయమా అంటూ గుజరాత్ హైకోర్టు ప్రశ్నిస్తూ మొట్టికాయలు కూడా వేసింది. పనిలోపనిగా పిటిషనర్‌కు రూ.25 వేల అపరాధం కూడా విధించింది. ప్రధాని మోడీ సర్టిఫికేట్లను చూపించాల్సిన అవసరం పీఎంవోకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీరేన్ వైష్ణవ్‌‍తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ మేరకు తీర్పును వెలువరించింది. 
 
ఇది ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి పదవి చేపడితే అతడు డాక్టరేట్ చేశాడా లేదా నిరక్షరాస్యుడా అనే తేడాలు ఉండరాదు. అయినా ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడం తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది అంటూ కోర్టు ప్రశ్నించింది. 
 
మరోవైపు, ఈ కేసులో గుజరాత్ యూనివర్శిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గతంలో సమర్పించిన వివరాల ప్రకారం గుజరాత్ యూనివర్శిటీ నుంచి 1978లో డిగ్రీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments