Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో 15 మందిని తొక్కుకుంటూ వెళ్లిపోయిన కారు డ్రైవర్!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (13:23 IST)
ఢిల్లీలో ఓ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ ఏకంగా 15 మందిని ఢీకొట్టి, వారిని తొక్కుకుంటూ కారును నడిపాడు. ఈఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన 22 యేళ్ల సీతాదేవిగా గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్యాక్సీ డ్రైవర్ మయూర్ విహార్ ఫేజ్ 3కి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. 
 
పీకల వరకు మద్యం సేవించిన ట్యాక్సీ డ్రైవర్ బుదవారం రాత్రి 9.30 గంటల సమయంలో రద్దీగా ఉన్న బుద్ధ్ బజార్ ప్రాంతంలోని జనాన్ని తొక్కించుకుంటూ పోయాడు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్ళడంతో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కారును ధ్వంసం చేశారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించగా, స్థానికులు వారిని ఘెరావ్ చేశారు. అయితే, పోలీసులు లాఠీలకు పని చెప్పి వారిని చెదరగొట్టి, నిందితుడుని తమ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments