Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు రూఫ్.. ముగ్గురి మృతి.. కార్లు నుజ్జునుజ్జు

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (11:16 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఎయిర్‌పోర్టు రూఫ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. రూఫ్ కూలిపోవడంతో దానికింద పార్కింగ్ చేసివున్న కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటన టెర్మినల్ 1డి వద్ద జరిగింది. ఈ ఘటనతో చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, అక్కడ నుంచి వెళ్లాల్సిన విమానాలను మధ్యాహ్నం ఒంటిగంటవరకు రద్దు చేశారు. 
 
రూఫ్ షీట్‌తో పాటు దానికి సపోర్డుగా ఉన్న పిల్లర్లు ఒక్కసారిగా శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలాయి. దీంతో డిపార్చల్ లైన్ వద్ద పార్క్ చేసిన కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ఘటనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ రహదారులు చిన్నపాటి కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments