Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ గాలి... జనరేటర్ల వాడకంపై నిషేధం

దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చలికాలం ప్రవేశిస్తూనే వాతావరణాన్ని ప్రభావితం చేసింది. ఫలితంగా ఢిల్లీలో జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించారు. ఇప్పటికే దీపావళికి టపాకాసులు కా

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (10:59 IST)
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చలికాలం ప్రవేశిస్తూనే వాతావరణాన్ని ప్రభావితం చేసింది. ఫలితంగా ఢిల్లీలో జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించారు. ఇప్పటికే దీపావళికి టపాకాసులు కాల్చకుండా, చివరకు విక్రయించకుండా కూడా సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
సాధారణంగా చలికాలం ప్రవేశిస్తూనే ఢిల్లీ వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. పొగమంచు మహానగరాన్ని కమ్మేయగా, గాలిలో స్వచ్ఛత కనిష్టానికి పడిపోయింది. ఒక్క దీపావళి టపాకాయ కూడా పేలకుండానే ప్రమాదకరస్థాయికి గాలి చేరింది. ఇక పరిస్థితి మరింత విషమించకుండా చూసేందుకు రంగంలోకి దిగిన మునిసిపల్ అధికారులు జనరేటర్ల వాడకంపై నిషేధాన్ని ప్రకటించారు. 
 
మార్చి 15వ తేదీ వరకూ పొగమంచు కొనసాగే అవకాశాలు ఉండటంతో కార్ పూలింగ్, సరి బేసి విధానం వంటి నిర్ణయాలు కూడా తెరపైకి రానున్నాయి. గత సంవత్సరం అక్టోబరు నెలలో సాధారణ స్థాయికంటే, 14 నుంచి 16 రెట్ల అధిక కాలుష్యం నమోదుకాగా, ఈ సంవత్సరం అంతకు మించిన కాలుష్యం నమోదవుతుందని ఈపీసీఏ (ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ (ప్రివెన్షన్) అండ్ కంట్రోల్ అథారిటీ అంచనా వేస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments