Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతి ఓ వ్యక్తి ప్రాణం తీసింది అంటే నమ్ముతారా?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (23:03 IST)
కోతి ఓ వ్యక్తి ప్రాణం తీసింది అంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఢిల్లీలో ఓ వానరం చేసిన పనికి ఓ మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని నబికరీం ప్రాంతంలో నివాసం ఉంటున్న మహ్మద్ కుర్బాన్ అనే వ్యక్తి తలపై ఓ ఇంటి నుంచి ఇటుక రాయి పడింది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 
వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి కారకులెవరో తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
విచారణలో కోతులకు భయపడి ఓ వ్యక్తి నీటి ట్యాంకులపై ఇటుక రాళ్లు పెట్టే వాడని... ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను కిందకు విసరగా, మహ్మద్ కుర్బాన్ పై పడిందని తెలిపాడు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఇటుక పడే మహ్మద్ కుర్బాన్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments