Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే పార్టీకి పిలిచి... బాలికకు మత్తుమందిచ్చి.. స్నేహితుల గ్యాంగ్‌రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. 13 యేళ్ళ బాలికపై కొంతమంది స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పుట్టిన రోజు పార్టీకంటూ పిలిచి.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డా

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (11:46 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. 13 యేళ్ళ బాలికపై కొంతమంది స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పుట్టిన రోజు పార్టీకంటూ పిలిచి.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పుట్టిన రోజు కోసం తన స్నేహితులను ఆహ్వానించాడు. వారిలో ఓ 13 యేళ్ల బాలిక కూడా ఉంది. ఈ పార్టీకి వచ్చిన ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. అది సేవించగానే ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. తర్వాత ఆమెను నిందితులు కలిసి అక్కడకు సమీపంలోని ఓ ఆస్పత్రి వద్ద వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
 
అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను చూసి ఆస్పత్రి వర్గాలకు చెప్పడంతో విషయం తెలిసింది. తర్వాత ఎలాగోలా ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో 17 ఏళ్ల మైనర్ కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్ల సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 376-డి (గ్యాంగ్ రేప్‌), పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం