Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువునష్టం కేసులో జయ సర్కారుకు సుప్రీం చెంపదెబ్బ!

పరువునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని విమర్శించారని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై వేసిన అన్నాడీఎంకే తరపున న్యాయవాది ఒకరు దావాల

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (09:39 IST)
పరువునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని విమర్శించారని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై వేసిన అన్నాడీఎంకే తరపున న్యాయవాది ఒకరు దావాలో దిగువ కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంట్ల అమలును గురువారం సుప్రీంకోర్టు నిలిపేసింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువునష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోరాదని హితవు పలికింది. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థ ఆకాంక్షలు, భిన్నాభిప్రాయాలు, విమర్శలు, అసమ్మతి, సహనం వంటి ప్రాథమిక అంశాలతో కూడుకొన్నదని, తమకు నచ్చని అంశాలను ప్రజలు విమర్శల ద్వారానే వ్యక్తీకరిస్తారని పేర్కొంది. విమర్శలపట్ల సహనం వహించకుండా అదేపనిగా ప్రభుత్వం పరువునష్టం కేసులు వేయడం తగదని చెప్పింది. అసమ్మతి గొంతు నొక్కరాదని, ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించేవారిపై ఐపీసీలోని 499, 500 సెక్షన్ల కింద పరువు నష్టం కేసులు పెట్టడం కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments